Ashta Someswaras ( అష్ట సోమేశ్వరములు )

ద్రాక్షారామం , కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ గల పంచారామాల్లో ఒకటైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం

ద్రాక్షారామంలోని లింగాన్ని సూర్య దేవుడు సూర్యుడు ప్రతిష్టించాడు. దీంతో పరిసర ప్రాంతాల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి, చంద్రుడు ద్రాక్షారామం యొక్క ఎనిమిది దిశలలో ఎనిమిది లింగాలను ప్రతిష్టించాడు.

ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు.

1) తూర్పున కోలంక,
2) పడమర వెంటూరు
3) దక్షిణాన కోటిపల్లి
4) ఉత్తరాన వెల్ల
5) ఆగ్నేయంలో దంగేరు
6) నైరుతిలో కోరుమిల్లి
7) వాయువ్యంలో సోమేశ్వరం
8) ఈశాన్యాన పెనుమళ్ళ

ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది

శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం, సోమేశ్వరంలో ఒక ఫలకం; అష్ట సోమేశ్వరాల స్థానాలు, నవ లింగాలు మరియు వాటి ప్రతిష్ఠాపన వెనుక కథను చూపుతుంది

ఈ ఎనిమిది లింగాలతో పాటు ద్రాక్షారామ లింగాన్ని నవ లింగాలు అంటారు. అదే రోజున ఈ నవ లింగాలను దర్శించుకోవడం పుణ్యకార్యమని నమ్ముతారు

పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది “దక్ష ఆరామం”గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

దక్షారామం దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వీరభద్రుడు ఈ ప్రదేశంలో చేసిన విధ్వంసం మరియు మారణహోమం తరువాత శివుడు ఈ స్థలాన్ని పవిత్రం చేశాడు. ఈ కథ కారణంగా, దక్షారామాన్ని దక్షిణ కాశి (దక్షిణ వారణాసి) అని కూడా పిలుస్తారు.

ఈ పట్టణాన్ని పూర్వం ధక్షతపోవన మరియు ధాక్షవాటిక అని పిలిచేవారు.అన్ని ప్రజాపతులకు అధిపతి అయిన దక్షుడు “నిరీశ్వర యాగం” లేదా “నిరీశ్వర యజ్ఞం” అనే యజ్ఞం లేదా యజ్ఞం చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం యొక్క ప్రస్తుత పేరు “దక్ష ఆరామం” నుండి ఉత్పన్నం, దీని అర్థం “దక్షుని నివాసం” ఈ ప్రదేశాన్ని జగద్గురు శంకరాచార్య/ ఆది శంకరులు మహా శక్తి పీఠ శ్లోకంలో “మాణిక్యే దక్షవాటిక”లో “ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి”ని సూచించే దక్షవాటిక అని కూడా పేర్కొన్నారు. దక్షుడు “నీరీశ్వర యజ్ఞం” చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ ఇక్కడ యాత్రికులు సందర్శిస్తారు

ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.

శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి “ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్…. ” అని చెప్పుకొన్నాడు.

శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి’ అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.


పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం ‘కుమార సంభవం’ జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను, వాటిలో ఒకటి ద్రాక్షారామం.

Published by – Bk Prasad ( Bandaru Krishna Prasad ) Founder & Managing Editor

Thank you for reading please share

Leave a comment

Design a site like this with WordPress.com
Get started